Saturday, April 27, 2024

నాలుగో త్రైమాసికం, పూర్తి ఏడాదికి ఫలితాలను ప్రకటించిన ఆన్‌ మొబైల్‌..

హైదరాబాద్, (ప్రభ న్యూస్‌) : మొబైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో అంతర్జాతీయ అగ్రగామి అయిన ఆన్‌ మొబైల్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ (ఆన్‌ మొబైల్‌ ) 2022 మార్చి 31తో ముగిసిన 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి, పూర్తి ఏడాదికి ఫలితాలను ప్రకటించింది. ఆన్‌ మొబైల్‌ సీఈఓ, ఎండీ సంజయ్‌ బావేజా మాట్లాడుతూ….ఈ ఏడాది మొత్తంగా, త్రైమాసికం పరంగా తమ సంస్థ పనితీరుతో తాము సంతోషంగా ఉన్నామన్నారు. తాము తమ దృష్టిని మొబైల్‌ గేమింగ్‌ పైకి మరల్చిన నేపథ్యంలో తాము పరివర్తన దశ ప్రయాణంలో ఉన్నామన్నారు. గ్లోబల్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ ఆశీష్‌ ఛటర్జీ మాట్లాడుతూ… తమ నూతన ప్రయాణంలో మార్జిన్లను కొనసాగిస్తూనే నిలకడగా మరో త్రైమాసికంలో వృద్ధి నివేదించడం ఆనందదాయ కమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement