Friday, May 3, 2024

KKR vs PBKS | శశాంక్ హిట్టింగ్, బెయిర్‌స్టో సెంచరీ.. పంజాబ్ భల్లే భల్లే

ఐపీఎల్‌ 2024లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. కోల్‌క‌తా నిర్దేశించిన‌ భారీ ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 హిస్టరీలోనే అత్యధిక పరుగులు సక్సెస్‌ఫుల్‌గా ఛేదించిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.

కోల్‌కతా నిర్ధేశించిన 262 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు విధ్యంసం సృష్టించారు. ఓపెనరలు ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్ (54) బౌండ‌రీల మీద బౌండ‌రీలు బాదాతూ.. 18 బంతుల్లోనే అర్ధ శ‌త‌కం సాధించాడు… ఇక జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్) దంచికొట్టాడు. మరో ఎండ్‌లో శశాంక్ సింగ్ (68 నాటౌట్)తో విజృంభించాడు. దీంతో ఈ భారీ ఛేజ్‌లో ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని మూటగట్టుకుంది పంజాబ్ జట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement