హైదరాబాద్, (ప్రభ న్యూస్) : హెచ్డిఎఫ్సి బ్యాంక్, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మంగళవారం మహిళా క్రీడాకారిణులకు అలాగే తర్ఫీదుదారులకు అన్స్టాపబుల్ కర్కే దిఖావూంగీ అనే రెండు దశల స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈసందర్భంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు సి ఎస్ఆర్, బిజినెస్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ మాట్లాడుతూ… సామాజికంగా బాధ్యతాయుత కార్పొరేట్ పౌరునిగా తాము దేశంలోని క్రీడా ప్రతిభలను పోషించేందుకు అనుగుణంగా తమ మద్ధతును విస్తరించాలని కోరుకుంటున్నామన్నారు.
క్రీడలు మన దేశంలో యువత సమగ్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. ఈ ప్రతిభావంత క్రీడాకారులకు తగిన వనరులు, మౌలిక సదుపాయాల కొరత వారి శ్రమను వేగంగా వదిలిపెట్టేలా ఒత్తిడి పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ కొన్ని అంతరాలను భర్తీ చేసేలా డిజైన్ చేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..