Thursday, May 16, 2024

బంగారం దోచుకెళ్లిన నిందుతుడు అరెస్టు

మేనత్తని కొట్టి బంగారం దోచుకెళ్లిన నిందితున్ని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ డి.రఘు చందర్ వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కడమంచి రాములమ్మ తన కుమారునితో కలిసి హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటుంది. రెండు రోజుల క్రితం తన వ్యక్తిగత పనుల నిమిత్తం స్టేషన్ ఘన్ పూర్ కు వచ్చింది. శనివారం(ఏప్రిల్ 30) రోజున మోటం శివ అనే వ్యక్తి మేనత్త రాములమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రాములమ్మ మెడలోని బంగారం కాజేయాలని ప్లాన్ వేసుకున్నాడు. పక్కనే ఉన్న బండరాయితో ఆమె తల మీద గట్టిగా గాయపర్చి బంగార గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు.. శివను ఘన్ పూర్ రైల్వే గేట్ వద్ద పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు స్వాధీనం చేసుకోని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

త్వరితగతిన దొంగతనం కేసును చెధించి నిందితుడిని పట్టుకున్న స్టేషన్ ఘనపూర్ సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు  శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement