Thursday, May 16, 2024

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం-సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల

రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా 2 కోట్ల సిఆర్ఆర్ నిధుల తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మినీ లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో యం.పి.పి వ్యాళ్ళ అనసూర్య రాంరెడ్డి , జడ్పిటిసి కందుల సంధ్యారాణి , కన్నాల ఛైర్మన్ మనోహర్ రెడ్డి , సర్పంచ్ పల్లె అశోక్ , రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షులు బుచ్చి లింగయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement