Wednesday, July 24, 2024

Kolkata – ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తాం – మమతా బెనర్జీ

ఎన్నికల అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటినుంచి మద్దతిస్తానని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమికి కొంతకాలంగా దీదీ దూరంగా ఉన్నారు.

కోల్ కతా లో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ”మేము ఇండియా కూటమికి బయటినుంచే అన్నివిధాలుగా సాయం చేస్తాం. మా నాయకత్వం అందిస్తాం. బెంగాల్‌లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. దీనివల్ల ఏ ఒక్క తల్లీ, చెల్లీ సమస్యలను ఎదుర్కోరు. 100 రోజుల ఉద్యోగ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నవారు ఇబ్బందులకు గురికారు ” అని తెలిపారు.

- Advertisement -

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ చౌదరి నేతృత్వంలోని సీపీఎం, బెంగాల్ కాంగ్రెస్ ఇండియా కూటమితో లేవని, అవి భాజపాతో జత కట్టాయని దీదీ మండిపడ్డారు.

దేశంలోని 70 శాతం సీట్లకు ఎన్నికలు పూర్తికాగా మరో మూడు రౌండ్ల ఎన్నికలు మిగిలిఉన్నాయి. కాగా బెంగాల్‌లో ప్రతీ దశలోనూ ఓటింగ్ జరుగుతుంది. అధికార భాజపా దక్షిణాది నుంచి 370 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలపై దృష్టి సారించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement