Thursday, May 16, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం..

మరిపెడ : లారీ కారు ఢీ కొన్న ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలో సోషల్ వెల్ఫేర్ గురుకులం సమీపంలో జాతీయ రహదారి 563పై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మున్సిపల్ పరిధిలోని నేతావత్ తండాకు చెందిన నేతవత్ నాగేశ్వర రావు, భార్యా కైక, తల్లి పోలి(65) ముగ్గురు ఆదివారం శుభకార్యానికి నర్సింహులపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లారు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా సోషల్ వెల్ఫేర్ గురుకులం సమీపంలో ఖమ్మం వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి పోలి అక్కడికక్కడే మృతిచెందగా, నాగేశ్వరరావుకు తీవ్ర గాయలైయ్యాయి. భార్య కైకకు స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement