Saturday, May 25, 2024

విద్యార్థి సంఘం నాయకులపై చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు..

విద్యార్థి సంఘం నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు తొర్రూరు మున్సిపల్ చైర్మన్. దాంతో ఆయ‌న బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి లవిశెట్టి ప్రసాద్ అన్నారు. స్థానిక పట్టణంలో గాంధీ సెంటర్ లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘంపై.. మున్సిపల్ చైర్మన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చైర్మన్ రామచంద్రయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం డివిజన్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ..తొర్రూరులోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని.. దానిని తనిఖీ చేయాలని సంఘం నాయకులు ..మున్సిపల్ కమిషనర్ ను ఫోన్ లో కోరారు.

దాంతో మధ్యాహ్నం సమయంలో వెళ్దామని అనడంతో కమిషనర్ ను తీసుకుని వెళ్లడం కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా.. చైర్మన్ ఉండగా వారిని కూడా రమ్మని కోరారు. దాంతో చైర్మన్ రాకపోగా వచ్చిన విద్యార్థి సంఘం నాయకులను మీరు ఏ సంఘం అయితే ఏంటీ నేను రాను పో బయటికెళ్ళు అని అనడమే కాకుండా ..ఎస్ఎఫ్ఐ అయితే ఏంది.. ఇంకా ఏదైతే నాకేంది పో బయటికి వెళ్ళు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ విద్యార్థి సంఘం నాయకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేనియెడల జిల్లా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమీర్, నాయకులు వెంకటేష్, యోగిరాజు, కుమార్, నాగరాజు, సోహె ల్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement