Friday, May 10, 2024

Accident: లోయ‌లో ప‌డ్డ మినీ బ‌స్సు.. 10 మంది మృతి.. 16 మందికి తీవ్ర గాయాలు

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ రోజు తెల్లవారుజామున థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో ప‌డిపోయింది. ఈ ఘటనలో 10 మంది చ‌నిపోయారు. మ‌రో 16 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన‌ట్టు పీఎంఓ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement