Saturday, May 25, 2024

ప్రేమజంట ఆత్మహత్య..

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవ పేట మండలం గేటు వణంపల్లీ గ్రామం వద్ద రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 20 సంవత్సరాల లోపు వయస్సు గల ఇద్దరు యువతీ యువకులు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్.ఐ పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్ప‌త్రికి తరలించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement