Sunday, June 16, 2024

TG | ఈనెల 27న ప్రత్యేక సెలవు.. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాజువల్‌ లీవ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్‌ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు శుక్రవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేట్‌ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో సూచించారు. ప్రైవేట్‌ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిప్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకుగానీ, మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకుగానీ అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ కోరారు. ఈ మేరకు అన్నిసంస్థలు, కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement