Friday, April 26, 2024

శ్రీశైలం మల్లన్న సేవలో ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు

కుత్బుల్లాపూర్ : శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శుక్ర‌వారం మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సత్యనారాయణ, కొలుకుల జగన్, ఎన్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement