Thursday, May 2, 2024

TS | ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం… మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు

రంగారెడ్డి జిల్లా నందిగామలో శుక్రవారం భారీ అగ్నీ ప్రమాచం చోటుచేసుకుంది. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో… మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement