Thursday, May 16, 2024

ప్రతి పాఠశాలలో చైల్డ్ సేఫ్టీ క్లబ్ లను ఏర్పాటు చేయాలి: అడిషనల్ డీసీపీ

శంకర్ పల్లి, (ప్రభ న్యూస్) : ప్రతి పాఠశాలలో విద్యార్థులకు వారి వారి సమస్యలను తెలియ చెప్పేందుకు ఫిర్యాదుల పెట్టే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాజేంద్రనగర్ అడిషనల్ డిసిపి సాధన రష్మీ పరమాల్ అన్నారు. శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాచీన్ గ్లోబల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో చైల్డ్ సేఫ్టీ క్లబ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కచ్చితంగా ప్రతి పాఠశాలలో చైల్డ్ సేఫ్టీ క్లబ్ ను ఏర్పాటు చేయాలని తద్వారా విద్యార్థి దశలోనే సైబర్ క్రైములు ఈవ్ టీజింగ్ గుడ్ టచ్ బాడ్ టచ్ తదితర వాటిపై విద్యార్థులు అవగాహనతో ఉండడానికి అవకాశం ఉంటుందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మొకిల ఇన్స్పెక్టర్ నరేష్ సబ్ ఇన్స్పెక్టర్లు కృష్ణ మరియు కోటేశ్వరరావు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement