Monday, July 22, 2024

TS: పెంపుడు కుక్క దాడి.. 5నెలల శిశువు మృతి..

ఆవేశంలో కుక్కను చంపేసిన కుటుంబీకులు
తాండూరు మండల పరిధిలో ఘటన
తాండూరు రూరల్, మే 14 (ప్రభన్యూస్) : 5నెలల శిశువుపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. విచ‌క్షణంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధి బసవేశ్వర నగర్ లో సంగెంకలాన్ గ్రామానికి చెందిన జి.నాగభూషణంకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. గత 5నెలల క్రితం వీరికి బాలుడు(సాయి నాథ్‌) జన్మించాడు. ఇవాళ‌ ఉదయం దత్తు యూనిట్లో పనిచేస్తుండగా, భార్య వస్తువులు కొనేందుకు ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో పాలిషింగ్‌ యూనిట్ యజమానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి వెళ్లి బాలుడుపై దాడి చేసి కరిచేసింది. అప్పటికే కేకలు విన్న కుటుంబీకులు వచ్చి చూసే సరికి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి కారణమైన కుక్కను ఆవేశంతో కుటుంబ‌ సభ్యులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కరణ్‌ కోట్‌ ఎస్ఐ విఠల్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement