Tuesday, April 30, 2024

టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

గుడుపల్లి, ఆగస్టు 14(ప్రభ న్యూస్ ): – బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారి విద్యార్థి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొందని తెలుపుతున్న ఎవ్వరు నమ్మడం లేదు. పదవతరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పై మండలం లో పెద్ద దుమరం రేగింది. గుడిపల్లి మండలం బెగ్గిలపల్లి పంచాయతీ బండ కొత్తూరు గ్రామంలో ఘటన చోటు చేసుకొంది.


గ్రామానికి చెందిన ప్రకాష్ వృత్తి రీత్యా డ్రైవర్ గా బెంగళూరు పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కుమార్తె, కుమారుడు కుమార్తె దివ్య పదవ తరగతి బెగ్గలపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. యధావిధిగా ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని నానమ్మకు చెప్పి వెళ్లిన దివ్య పదకొండు గంటల ప్రాంతంలో చెట్టుకి ఉరివేసుకొని మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దివ్య ను తల్లిదండ్రులు మందలించడం బాలిక ఆత్మ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. గుడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement