Friday, May 17, 2024

Tollywood : స్టేజ్ పై రాశీతో త‌మ‌న్నా చిందులు

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెట్టింట తరచూ హాట్ హాట్ ఫోజులతో సెగలు పుట్టించే ఈ భామ ప్రస్తుతం సంప్రదాయ చీరకట్టులో సందడి చేస్తోంది. ఈ బ్యూటీ రాశీఖన్నా తో కలిసి వన్ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న హార్రర్‌ కామెడీ ప్రాజెక్ట్‌ అరణ్మనై 4.

- Advertisement -

పాపులర్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ సుందర్ సి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తోన్న ఈ మూవీ తెలుగులో బాక్ టైటిల్‌తో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మే ౩న విడుదల కానున్న నేపథ్యంలో అరణ్మనై 4 టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ ఇటీవలే లాంఛ్ చేసిన రాశీఖన్నా, తమన్నా కలర్‌ఫుల్‌ సాంగ్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌ గార్డెన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారని తెలిసిందే. ఈవెంట్‌లో ట్రైలర్‌ కూడా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా తమన్నా స్టేజీపై పంచుకో సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టింది. మిల్కీ బ్యూటీతోపాటు రాశీఖన్నా, ఖుష్బూ సుందర్‌ కూడా డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్‌, ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement