Sunday, May 19, 2024

మెదక్ లో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం

మెదక్ ప్రతినిధి:ప్రభ న్యూస్ – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి ,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఎల్లారెడ్డి పర్యటన ముగించుకొని మెదక్ మీదుగా హైదరాబాద్ కు తిరిగు పయనం అయ్యారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయనికి వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి,మదన్ రెడ్డి ,చంటి క్రాంతి కిరణ్ ,మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి లతో కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పర్యటన, సభ ఏర్పాట్లపై వచ్చిన రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ హరీష్ రావు తో కొద్దిసేపు ముచ్చటించారు

.మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మనువడు ని మంత్రి కేటీఆర్ ఎత్తుకొని ముద్దాడటం పట్ల ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ లు దిగేందుకు పొడిపడ్డారు.అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి హైదరాబాద్ తిరిగి పయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement