Tuesday, July 23, 2024

TS: మంత్రాల నెపంతో దంపతులపై దాడి…

మంత్రాల నెపంతో దంప‌తుల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేసిన ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండలం వేలుబెల్లిలో గ్రామానికి చెందిన యుగంధర్, రాధిక దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, వారిద్దిరూ మంత్రాలు చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన లక్ష్మినర్సు, కృష్ణ కొంతకాలం నుంచి వారిపై పగబట్టారు.

దీంతో అదును చూసి ఇవాళ వారిద్దరిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం అవుతున్న దంపతులను స్థానికులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement