Wednesday, May 8, 2024

మునుగోడు టీఆర్ఎస్ దే.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం ఖాయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం మునుగోడులో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన ప్రజా దీవెన సభకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 500 కార్లతో భారీ కాన్వాయ్ తో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో జెండా ఊపి కాన్వాయ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవ పరుస్తూ, తన వ్యక్తిగత వ్యాపార అవసరాల నిమిత్తం రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గం నుండి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో బయలుదేరి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement