Thursday, May 16, 2024

MDK : కాంగ్రెస్ జోష్… కదనరంగంలోకి జ‌గ్గారెడ్డి

ఉమ్మడి మెదక్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ః మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మద్దతుగా స్వయంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కదనరంగంలోకి అడుగుపెట్టారు. నీలం మధు గెలుపే లక్ష్యంగా జగ్గారెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈసందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో శ‌నివారం విస్తృత ప్రచారం చేపట్టారు.

- Advertisement -

పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గమంతా కలియతిరిగారు. వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రచార రంగంలో అభివాదం చేస్తూ యువనేత నీలం మధును గెలిపించాలని జగ్గారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రెసిడెంట్ అంజయ్య గౌడ్, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. కాగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వినూత్న ప్రచారంతో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement