Saturday, May 4, 2024

తెలంగాణ‌లో కాంగ్రెస్ కొంప స‌రిగాలేదు : సీపీఐ నారాయ‌ణ‌

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు క‌మ్యూనిస్టు పార్టీ సీపీఐ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు గ‌ల కార‌ణాలు చెబుతూ సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ… కాంగ్రెస్ పార్టీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ‌వ్యాప్తంగా తాము కాంగ్రెస్ పార్టీకే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే మునుగోడులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని నిర్ణయించామ‌న్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కొంప స‌రిగా లేని కార‌ణంగానే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించామ‌ని నారాయ‌ణ తెలిపారు. భవిష్య‌త్తు రాజ‌కీయాల‌కు ఏ ఒక్క‌రూ భ‌రోసా ఇవ్వ‌లేర‌ని కూడా నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement