Wednesday, May 22, 2024

MI vs KKR | ఈజీ మ్యాచ్‌లో తడబడ్డ ముంబై.. కోల్‌కతా విజయం

వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు విజయం సాధించింది. భారీ స్కోర్ సాధించడంలో కోల్‌కతా బ్యాటర్లు విఫలమైనప్పటికీ బౌలర్లు చెలరేగడంతో ముంబైపై విజయం సాధించారు. 170 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ముంబైపై కోల్‌కతా 24 పరుగుల తేడాతో గెలుపొందింది.

170 పరుగుల ఛేజ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (56) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement