Sunday, May 19, 2024

MDK : బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాలి… హ‌రీష్‌రావు

అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి, కాంగ్రెస్‌ల‌కు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

- Advertisement -

మాయ మాటలు చెప్పి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్, బీజేపీ లను ఎంపీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. ఢిల్లీలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. బిజెపి పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించిందన్నారు. బీడీ కార్మికులను కడుపున పెట్టుకుని 2000 పింఛన్ కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కట్టలపై గొర్రె గుర్తు బిజెపి ప్రభుత్వం వాటిపై 28% జిఎస్టి తీసుకువచ్చి కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు హామీల అమలను పూర్తిగా మరిచి ప్రజల గుండెల మీద తంతుందన్నారు. వడ్లు నేడు కల్లాలకు వచ్చిన ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ లేదని అన్నారు. ఉద్యమాల ప్రతిగడ్డ మెదక్ స్థానంపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు విడుదల చేయలేదా అని వివరించారు. కాంగ్రెస్ హామీలను ప్రశ్నించిన కేసీఆర్ కండ్లు పీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటా, చెడ్డి గుంజుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అంటే మనల్ని అవమాన పరిచినట్లు కదా అని, ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు..రాదు అనుకున్న తెలంగాణ ను ప్రాణాలకు తేగించి సాధించిన కేసీఆర్ ను మనం కాపాడుకోవలన్నారు.బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి, పించిన్ లు ఇస్తామని మోసం చేసిన రఘునందన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ది చెప్పారన్నారు..మరోసారి ఎంపీ ఎన్నికల్లో వస్తున్నాడని, మన తడాఖా చూపెట్టాలన్నారు.

గల్లీలో పనికిరాని వాడు ఢిల్లీలో పనికొస్తాడాః ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
గల్లీ లో చిత్తుగా ఒడిపోయినోడు, ఢిల్లీ కి ఎలా పనికొస్తాడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు..స్వంత గ్రామం
బొప్పాపూర్ లో చెల్లని రూపాయి రఘునందన్ మెదక్ ఎంపీ గా ఎలా చెల్లుతాడన్నారు..దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చి మోసం చేసిన రఘునందన్ ను మరోసారి చిత్తుగా ఓడించాలన్నారు.మనం నిర్మించుకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు విడుదల చేసుకోవడానికి ధర్నాలు చేయాల్సి వొచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మనోహర్రావు, వెంకట నరసింహారెడ్డి, కత్తి కార్తిక, సోలిపేట సతీష్ రెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు లక్ష్మి లింగం, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపిటిసి సభ్యులు నర్సింలు, లక్ష్మి మల్లయ్య, మండల యువజన విభాగం అధ్యక్షుడు కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు బాబు, కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, గొల్ల రాములు, మల్లేశం గౌడ్, రాజమహేందర్ రెడ్డి, బాపురెడ్డి, పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement