Wednesday, July 24, 2024

MDK: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి నీలం మధు

ఉమ్మడి మెదక్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ః తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు దర్శించుకున్నారు. మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్న నీలం మధు ఉదయం విఐపి బ్రేక్ దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా దేవదేవుడు శ్రీనివాసుడు ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ తో పాటు తెలంగాణలో అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement