Wednesday, May 8, 2024

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

మహబూబ్‌నగర్‌ : మూసాపేట్‌ మండల పరిధిలోని తిమ్మాపూర్‌ లో వివాహేతర సంబంధం ప్రాణాలు తీసింది. జానంపేట గ్రామానికి చెందిన కావలి రాములు (35), తిమ్మాపూర్‌ కు చెందిన వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కావలి రాములు నేరుగా మహిళ ఇంటికి వెళ్లాడు. కావలి రాములును చూసి ఆవేశానికి గురైన మహిళ భర్త కోసంతో అతడిని పట్టుకుని కట్టేసి కొట్టడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement