Thursday, May 2, 2024

వ్యవసాయ గోదాంను ప్రారంభించిన ఎమ్మెల్యే..

దేవరకద్ర : రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ గోదాంను ఎమ్మెల్యే ప్రారంభించారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. రైతులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మళ్లిd ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని అందుకు రైతు సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దపీట వేయడం జరిగిందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. అన్నదాతలకు అండగా ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు , ఎంపిపిలు , పార్టీ అధ్యక్షులు అధికారులు , కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement