Thursday, May 2, 2024

అధిక ధరలకు విక్రహిస్తే సంఘటితంగా పోరాటం

ప్రభన్యూస్, యాదాద్రి ప్రతినిధి: వినియోగదారులకు వస్తువులను అధిక ధరలకు విక్రహిస్తే సంఘటితంగా పోరాడాలని కాంగ్రెస్ జిల్లా నాయకుడు కల్లూరి రాంచంద్రా రెడ్డి అన్నారు. ఆదివారం యదాద్రిభువనగిరి జిల్లాలోని  యాదగిరిగుట్ట మండల కేంద్రంలో లక్కీ ఫంక్షన్ హాల్ లో వినియోగదారుల హక్కుల సంస్థ సమావేశాన్ని నిర్వహించారు. కల్తీ లేని స్వచ్ఛమైన వస్తువులను ప్రజలకు చేరేలా చూడాలన్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా బొద్దుల నగేష్,  కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కుడుదుల నగేష్, బిర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement