Tuesday, May 14, 2024

చైనాలో అగ్ని ప్ర‌మాదం – తొమ్మిది మంది మృతి

చైనాలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మృతి చెందారు. న‌లుగురు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈశాన్య చైనాలోని డాలియ‌న్ సిటీలోని మార్కెట్ దిగువ‌న ఉన్న అండ‌ర్ గ్రౌండ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాగా భూగ‌ర్భ ప్రాంతంలో మంట‌ల‌ను ఆర్పుతూ ఫైర్ ఫైట‌ర్ ఒక‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement