Saturday, April 27, 2024

దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ : త‌ల‌సాని

దేశంలో ఎక్కడా లేని విధంగా 80 వేలకు పైగా ఉద్యోగుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఉచిత కోచింగ్ సెంటర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నార్త్ జోన్ డిసిపి చందనాదీప్తి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి విద్యార్థులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాుతూ… విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం అన్నపూర్ణ వారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే వరకు కోచింగ్ సెంటర్ ను ఉపయోగించుకోవాలన్నారు. కష్టపడి చదివితే ఏ ఉద్యోగాన్నైనా సాధించవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement