Saturday, April 27, 2024

డిప్యూటీ కలెక్టర్ జ్యోతి సురేఖకు డా.లక్ష్మికాంతం అభినందనలు

హైదరాబాద్ : స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్ గా నియమితులైన జ్యోతి సురేఖను విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ జేఈవో, పూర్వ కృష్ణా జిల్లా కలెక్టర్ డా.బీ.లక్ష్మికాంతం అభినందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని నోవాటెల్ వేదికగా జరిగిన అభినందన సభలో ఆయన పూలబొకే, శాలువతో ఆమెను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జున అవార్డు గ్రహీతగా, ప్రపంచ ఛాంపియన్ షిప్ ఆర్చరీ విభాగంలో 3 పతకాలు సాధించిన జ్యోతి సురేఖ అకుంఠిత దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. అమ్మాయిల్లో ఆణిముత్యంగా, భావితరాలకు మార్గదర్శిగా జ్యోతి సురేఖ నిలిచారని అభినందించారు. నిరంతర శ్రమతోనే ఆమె, డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారని, ఆ పదవికి వన్నె తేవడంతో పాటు, ప్రజల ఆకాంక్షలు, సమస్యల పరిష్కారానికి మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్ లోనూ లబ్ధిదారులకు వాటిని చేరవేయడంలోనూ డిప్యూటీ కలెక్టర్ గా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి, మహోన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ మాట్లాడుతూ డా.లక్ష్మికాంతం లాంటి పెద్దల ఆశీర్వాదం, సూచనలను తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement