Sunday, May 5, 2024

మా వ‌ద్ద అనుబాంబులు ఉన్నాయ్.. భార‌త్ ని హెచ్చిరించిన పాకిస్థాన్ మ‌హిళా మంత్రి

మా వ‌ద్ద అణుబాంబు ఉన్నాయ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు పాకిస్థాన్ మహిళా మంత్రి షాజియా మారీ..ఈ మేర‌కు భారత్ విషయంలో దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఒక అణ్వస్త్ర దేశం అన్న సంగతిని భారత్ గమనించాలని హెచ్చరిక చేశారు. తమ అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనుకంజ వేసే ప్రసక్తేలేదని షాజియా స్పష్టం చేశారు. ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసు. చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదు. అదే స్థాయిలో బదులిస్తుంది. మా వద్ద అణుబాంబు ఉందన్న విషయం భారత్ మర్చిపోరాదు. భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోదీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయి. భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోంది అంటూ షాజియా మారీ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement