Saturday, May 18, 2024

TS : ఇవాళ న‌గ‌రంలో… ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ప‌రేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో అమిత్‌షా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి తెలిపారు.

- Advertisement -

పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఆదివారం సాయత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఆంక్షలుంటాయన్నారు. పంజాగుట్ట నుంచి గ్రీన్‌ల్యాండ్స్‌, బేగంపేట నుంచి పెరేడ్‌ గ్రౌండ్స్‌, తివోలీ క్రాస్‌ రోడ్‌ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ వరకు వాహనాలను నిలిపివేస్తామని తెలిపారు. క్లాక్‌టవర్‌, వైఎంసీఏ, సీటీఓ క్రాస్‌రోడ్స్‌, బ్రూక్‌బాండ్‌ క్రాస్‌ రోడ్స్‌, స్వీకార్‌ ఉపకార్‌, పంజాగుట్ట, వద్ద ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయన్నారు.

సభకు వచ్చిన వారు తమ వాహనాలను నిలుపేందుకు బైసన్‌ పోలో గ్రౌండ్స్‌, కంటోన్మెంట్‌ పార్కు, హాకీ గ్రౌండ్‌ సమీపంలోని ధోబీఘాట్‌లలో స్థలం కేటాయించారు. అధికారుల వాహనాలకు జింఖానా గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ కేటాయించారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని సీపీ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement