Wednesday, May 22, 2024

MBNR : ముదిరాజ్‌ల మద్దతుతో వంద శాతం గెలుపు నాదే.. ఎంపీ అభ్య‌ర్థి చ‌ల్లా

మక్తల్, మే5(ప్రభన్యూస్) తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముదిరాజ్ కులాన్ని బీసీ డీ గ్రూపు నుండి ఏ గ్రూపులోకి మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పాలమూరులో ముదిరాజుల మద్దతుతో మద్దతుతో ఎంపీగా తాను గెలవబోతున్నానని అన్నారు. సారా వ్యాపారం, అక్రమ క్రషర్ ,అక్రమ కల్లుదంతాలతో కోట్లకు పడగలెత్తిన ప్రత్యర్థుల ముందు సామాన్య రైతు కుటుంబానికి చెందిన తాను ఎన్నికల్లో గెలుస్తానా లేదన్న చిన్న అనుమానం ఉండిందని ముదిరాజుల మద్దతుతో వందకు వంద శాతం తాను ఎంపీగా గెలవడం ఖాయం అయిపోయిందన్న ఆత్మవిశ్వాసం ఇవాళ తనకు కలిగిందని అన్నారు. మాట ఇస్తే మడమతిప్పని ముదిరాజుల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.డిగే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ముదిరాజులు ఎదగాలన్న అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement