Saturday, May 18, 2024

TS: ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక ప్రధాని మోడీ… కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ హ‌యాంలో చాలా స్కామ్ లు జ‌రిగాయ‌న్నారు. తాము అవినీతి లేకుండా నీతివంత‌మైన పాల‌న అందిస్తున్నామ‌న్నారు. బిఫోర్ మోడీ… ఆఫ్ట‌ర్ మోడీ అనేది చూడాల‌న్నారు. కాంగ్రెస్ హ‌యాంలో అనేక కుంభ‌కోణాలు జ‌రిగాయ‌న్నారు.

ముస్లింలు కూడా త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు. ప్ర‌పంచం మొత్తం భార‌త్ వైపు చూస్తోంద‌న్నారు. దేశ వ్యాప్తంగా 400 స్థానాలు దిశ‌గా, తెలంగాణ‌లో అత్య‌ధిక స్థానాల్లో గెలుపొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. లోక్​సభ ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలత లేదన్న కిషన్​రెడ్డి, కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement