Monday, May 6, 2024

విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి నింపేలా గాంధీ సినిమా ప్రదర్శ‌న : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్‌ పట్టణంలోని తిరుమ‌ల థియేట‌ర్‌లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో క‌లిసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వీక్షించారు. విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి నింపేలా థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నామ‌న్నారు. ఈ సినిమాను ప్రతి ఒక్క విద్యార్థి చూసి స్వాతంత్య్ర స్ఫూర్తిని పొందాలనేది సీఎం కేసీఆర్ అభిమతమని తెలిపారు. శాంతి, అహింసతో స్వతంత్య్రం సిద్ధించిందని, శాంతియుత పద్ధతుల్లో హక్కులను సాధించుకోగలమని నేటి పౌరులకు తెలియజెప్పే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement