Sunday, May 19, 2024

TS: పెళ్లింట్లో విషాదం.. వధువు తండ్రి గుండెపోటుతో మృతి

చెన్నూర్, ప్రభ న్యూస్ : కూతురు వివాహం చేసి 24 గంటలు గడవక ముందే తండ్రి గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పబ్బవాడలో సోమవారం విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే… పట్టణంలోని మెయిన్ రోడ్ లో జనరల్ స్టోర్ నడుపుతున్న మాజీ వార్డు మెంబర్ మహ్మద్ ఏజాజ్ ఆదివారం రాత్రి తన కూతురు వివాహం మంచిర్యాల పట్టణానికి చెందిన వ్యక్తికి ఇచ్చి హంగు హర్భటంగా విహాహం చేశాడు.

అయితే ఈరోజు ఉదయం 3 గంటల వరకు అమ్మాయిని అత్త‌ వారింటికి సాగనంపిన తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఏజాజ్ మృతి విషయం తెలుసుకున్న పట్టణ వాసులు అర్ధరాత్రి వరకు ఆనందంగా కుతూరు వివాహ వేడుకల్లో పాల్గొన్న వ్యక్తి మృతి చెందడంతో కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు, మిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement