Sunday, May 19, 2024

AP: వికసిత్‌ భారత్‌ మోదీ కల.. వికసిత్‌ ఏపీ బాబు, పవన్‌ కల: లోకేశ్‌

రాజమహేంద్రవరం: వికసిత్‌ భారత్‌ మోదీ కల.. వికసిత్‌ ఏపీ బాబు, పవన్ కల అని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వజీత్‌ ( విశ్వాన్ని జయించినవారు) అని నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగిస్తూ.. దేశానికి మోదీ అవసరం ఎంతో ఉందన్నారు. దేశం దశ.. దిశ మార్చింది ‘NAMO’ అనే నాలుగు అక్షరాలు అన్నారు. పొత్తు కోసం త్యాగం చేసి పవన్‌ కల్యాణ్‌ తొలి అడుగు వేశారు.

226 రోజులపాటు 3వేల కి.మీపైగా పాద యాత్ర చేసి.. ప్రజల కష్టాలను చూశాను. తెదేపా హయాంలో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాం. విశాఖను ఐటీ హబ్‌గా చేశాం. యువతకు ఉపాధి ఎలా అందించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్‌ పాలనలో మొదటి బాధితులు యువతే. కొత్త కంపెనీలు తేకపోగా.. పాత కంపెనీలను వెళ్లగొట్టారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది” అని లోకేశ్‌ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement