Tuesday, July 23, 2024

AP : శ్రీ‌వారి ద‌ర్శనానికి 24గంట‌లు వేచి ఉండాల్సిందే…

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వరసగా నాలుగు రోజుల నుంచి తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువయింది. అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

- Advertisement -

వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. వసతి గృహాల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement