Monday, July 22, 2024

AP: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.

- Advertisement -

మృతులు ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్(46), కంకణంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్ (50)లుగా గుర్తించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement