Friday, May 17, 2024

తొర్రూరు జెడ్పీ పాఠ‌శాల‌లో భారీ జాతీయ‌ప‌తాకం-శంకుస్థాప‌న చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

త్వ‌ర‌లో తొర్రూరు జెడ్పీ పాఠ‌శాల‌లో ఏర్పాటు చేయ‌నున్న భారీ జాతీయ ప‌తాక కార్య‌క్ర‌మానికి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మంత్రి ఫ్రీడం రన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం తరహాలో తొర్రూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భారీ జాతీయ పతాక కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు.పోరాడి సాధించిన తెలంగాణ తెర్లు కాకుండా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడడానికి సీఎం కేసీఆర్‌ గాంధీజీ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో 20 అత్యున్నత ఆదర్శ గ్రామాలను లెక్క తీస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే రావడమే ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement