Sunday, May 19, 2024

AP: భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ప్రధాని మోదీ: పవన్‌ కల్యాణ్‌

భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ప్రధాని మోదీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్రమోదీ అని అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ… భారత సమాజానికి గుండె ధైర్యమే మోదీ అని కొనియాడారు. పదేళ్ల పాలనలో శత్రువులు భారత్‌వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.

” ఆయన గొంతెత్తితే దేశంలో అణువణువూ స్పందిస్తోంది. కేంద్ర పథకాలను వైకాపా తన పథకాలుగా చెప్పుకొంటోంది. కేంద్ర పథకాలను జగన్‌ అందిపుచ్చుకోలేకపోయారు. ఐదు కోట్ల మంది ప్రజలను హింసించారు. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు. ఏపీలో లక్షలాది మంది యువత ఉన్నారు. దేశానికి జాతీయ జెండాను అందించిన నేల ఇది. మోదీ వికసిత్‌ భారత్‌ కలలో మేమూ భాగస్వాములవుతాం. గతంలో పద్మఅవార్డులు రాజకీయాలు చేసే వారికే వచ్చేవి. కానీ, మోదీ ప్రధాని అయిన తర్వాత అర్హులైన వారికే దక్కుతున్నాయి” అని పవన్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement