Monday, May 6, 2024

TS : విధుల్లో గని కార్మికుడు మృతి

కాసిపేట, మార్చి 16(ప్రభన్యూస్) మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసిపేట 2వ గని కార్మికుడు కర్రే రాజు (35) ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో మృతి చెందారు. విధుల్లో భాగంగా గనికి అవసరమగు డబ్లూ స్టాప్ లు, ఎస్కార్ట్ వాహనంతో లోడ్ చేస్తున్న క్రమంలో ఎస్కార్ట్ స్లింగ్ తెగిపోయి అతనిపై డబ్ల్యూ స్ట్రాప్ పడిపోయినట్లు కార్మికులు తెలిపారు. వెంటనే బాధితుడిని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement