జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ విద్యానగర్ కాలనీ సమీపంలో (సోమవారం) ఓ గుర్తుతెలియని మహిళ శిశువును గుడ్డలో చుట్టి చెత్తకుప్పలో పడేసింది. కాలనీ సమీపంలోని ఓ వ్యక్తి పాప ఏడుపును చూసి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
స్థానిక సీఐ అల్లం నరేందర్ ఆదేశాల మేరకు ఎస్ఐ గుండేటి రాజవర్దన్, బ్లూకోర్టు సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని స్థానిక భవానీ పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు మహిళలు ముక్కుపచ్చలారని గుర్తుతెలియని మహిళపై దూషిస్తున్నారు. ఈ హృదయ విచారకర ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.