Monday, May 13, 2024

ముంచెత్తిన వరద.. జలదిగ్బంధంలో ఆస్పత్రి భవనం..

మంచిర్యాల టౌన్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జిల్లా కేంద్రంలోని గోదావరి ఒడ్డున ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వరద నీరు ముంచెత్తింది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 47 గేట్లను ఎత్తి 10,02,741 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆసుపత్రి భవనం నీటిలో తేలియాడుతోంది. భారీగా వరద వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా అప్రమత్తమైన అధికారులు మంగళవారం రాత్రికి రాత్రే గర్భిణులు, బాలింతలను జనరల్ ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పినట్లయింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రి భవనం వరద ముంపు కారణంగా నిరుపయోగంగా మారింది. ఆసుపత్రిలోని లక్షలాది విలువ గల పరికరాలు కూడా పాడయ్యే పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement