Thursday, July 25, 2024

ADB: ఓటు వేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి అల్లోల

నిర్మల్ ప్రతినిధి, మే 13 (ప్రభ న్యూస్) : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం పోలింగ్ బూత్ నెం. 192 గాజుల్ పేట్ లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయనతోపాటు నిర్మల్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు వారి స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లోక్ స‌భ‌ ఎన్నికల సందర్భంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ఉదయం తన స్వగ్రామం మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఉదయం 7:00 గంట‌లకు స్వగ్రామం ఎల్లపెల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement