Tuesday, July 23, 2024

AP | పోలింగ్​ బూత్​లో వైసీపీ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ (వీడియో)

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొందరగా ఓటు వేసి ఇంటికి వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నాడు ఓ ఓటరు. ఈ క్రమంలో అతడికి ఊహించని ఘటన ఎదురైంది.

- Advertisement -

తాజాగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఆయన వెళ్లడం గమనించిన ఓటరు.. అభ్యంతరం వ్యక్తంచేశారు. పట్టరాని కోపంతో ఆయనపైకి దూసుకెళ్లారు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. అంతటితో ఆగకుండా ఓటరు చెంప చెళ్లుమనిపించారు. అది చూసి షాకైన ఓటరు, ఆయనపైకి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో అభ్యర్థి అనుచరులు ఓటరుని పోలింగ్ స్టేషన్ వద్ద చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement