Wednesday, July 24, 2024

ADB: ఉట్నూర్ లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

ఉట్నూర్, మే 13 (ప్రభన్యూస్) ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తన కుటుంబ సభ్యులతో కలిసి ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం ఓటు హక్కునువినియోగించుకున్నారు.తన క్యాంపు కార్యాలయం నుండి నేరుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో చేరుకుని పోలింగ్ బూత్ నంబర్ – 81 లో వారుఓటుహక్కునువినియోగించుకున్నారు.

ఓటు వేసినఅనంతరంవిజయసంకేతంతో నేను ఓటు వేశాను,ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని..ఇంకు ఉన్న వేలును చూపుతూ ఓటర్లలోఉత్సాహం కలిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement