Thursday, May 2, 2024

‘లైగ‌ర్’ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కుతున్న చిత్రం లైగ‌ర్. ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ గా అన‌న్య‌పాండే న‌టిస్తున్నారు. ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతుంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీని పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమాను థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే డిసెంబర్ 31, 2021 కి ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తున్నట్లు టైగర్ టీం వెల్ల‌డించింది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement