Sunday, April 28, 2024

తిరుమ‌ల‌లో ఇద్ద‌రు భ‌క్తుల‌పై చిరుత దాడి

తిరుమ‌ల ఘాట్ రోడ్డులో చిరుత దాడి కలకలం రేపింది. తిరుమల ఘాట్ రోడ్ లో ఇద్ద‌రు భ‌క్తుల‌పై చిరుతపులి దాడి చేసింది. తిరుమలలోని వరాహస్వామి కాటేజీలో పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి, ఆనందయ్య విధులకు హాజరయ్యేందుకు తిరుపతి నుంచి బైక్‌పై తిరుమలకు బయలుదేరారు. రెండో ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుండగా వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత పులి ఇద్దరి పై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఇద్దరు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. బైక్ పై ఇద్దరు వెళ్తున్న సమయంలో చిరుత రోడ్డు దాటుతుండగా వారిపై దాడి చేసినట్టు వీజీవో బాలారెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైందని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పులి దాడిలో గాయపడిన ఆనంద్ రామకృష్ణ లను విజిలెన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇద్ద‌రు భ‌క్తుల‌పై చిరుత దాడి చేయ‌డంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement